భూములు కోల్పోయి కులీలుగా మిగిలాం..


వైయస్‌ జగన్‌కు తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల మొర

విజయనగరంః బంటువానివలస తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పరిహారం అందక, ఉండేందుకు ఇల్లు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కన్నీరుమున్నీరయ్యారు. ఆర్‌అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అందడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే న్యాయం జరుగుతుందన్నారు.భూములు కోల్పోయి కూలీలుగా మిగిలామని అయినా ప్రభుత్వం ఆదుకోలేదని వాపోయారు.అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన స్పందించడంలేదన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top