రాజన్న బిడ్డకు ఆత్మీయ స్వాగతంబాధిత కుటుంబాలకు పరామర్శ<br/>హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ.... వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సోదరి షర్మిల గ్రేటర్ హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. మహానేత ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మరణించిన బాధిత కుటుంబాలకు నేనున్నానంటూ అండగా నిలిచేందుకు గ్రేటర్ లో తొలిసారిగా పరామర్శయాత్ర చేస్తున్నారు. రాజన్న బిడ్డకు వైఎస్సార్సీపీ శ్రేణులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, గ్రేటర్ ప్రజలు ఘనస్వాగతం పలికారు. <br/>ఈ ఉదయం 9 గంటలకు వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లోని తన ఇంటి నుంచి బయలుదేరారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45, మాదాపూర్ పీఎస్, హైటెక్ సిటీ ఫ్లైవర్ కింద నుంచి కొండాపూర్, మియాపూర్, చందానగర్ల మీదుగా తారానగర్ తుల్జాభవన్ దేవాలయ సమీపంలోని దిగంబరరావు ఇంటికి చేరుకున్నారు. ఆకుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని వారికి భరోసానిచ్చారు. <br/>అనంతరం కూకట్పల్లి ఆల్విన్ కాలనీ ఫస్ట్ ఫేజ్ చౌరస్తా సమీపంలో ఉన్న సన్నిధి కృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్ షర్మిల పరామర్శిస్తారు. ఆ తర్వాత కూకట్పల్లి రామాలయం సమీపంలోని టి.రణతేజ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మూసాపేట గాంధీ చౌరస్తా సమీపంలోని నోముల రాజయ్య ఇంటికి చేరుకుంటారు.<br/>2.30 గంటలకు షాపూర్ నగర్ చౌరస్తాలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి... అక్కడ ఏర్పాటు చేసే సభలో ప్రసంగిస్తారు. లెఫ్ట్ రోడ్డులో షాపూర్నగర్లోని దామా నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి... కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆతర్వాత సుభాష్ నగర్లోని వెంకట రమణరాజు ఇంటికి చేరుకుంటారు. ఆ తర్వాత దూలపల్లిలో సురకంటి రమేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. చివరగా మౌలాలి ఉల్ఫత్ నగర్లో అబ్దుల్ రహమాన్ కుటుంబాన్ని పరామర్శించి లోటస్ పాండ్కు చేరుకుంటారు. షర్మిల పరామర్శ యాత్ర షెడ్యూల్ను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ చెప్పారు.