‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
పంట పరిహారంపై సిఎం ప్రకటన చేయాలి!
08 Nov 2012 9:34 PM
ఖమ్మం
8 నవంబర్ 2012: రైతుల పంట నష్టపరిహారంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని వైయస్ ఆర్
కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ డిమాండ్ చేశారు.
పత్తిపంటకు ఎకరాకు రూ.25 వేలు, మిర్చికి రూ.20 వేలు పరిహారం చెల్లించాలని ఆమె కోరారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో తుఫాను వర్షాల కారణంగా నష్టపోయిన పత్తిపంటను
ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ తుపాను కారణంగా రైతులు
భారీగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం బృందం వచ్చి సర్వే చేస్తుందంటూ ప్రభుత్వం
చెపుతోందని, ఈ లోగా నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె హెచ్చరించారు. పంటనష్టపోయిన రైతులు నిర్వేదంతో ఆత్మహత్యలు చేసుకున్నాక సర్వేలు చేసి మాత్రం ఏం ప్రయోజనమని ఆమె ప్రశ్నించారు. సర్వేలు పూర్తి చేసేంతవరకు రైతులు వేచి ఉండాలనడం సరికాదన్నారు. రైతులకు పరిహారం వచ్చే వరకు ప్రభుత్వంపై
ఒత్తిడి తెస్తామని ఆమె చెప్పారు. రైతుల సమస్యలపై అసెంబ్లీని ముట్టడిస్తామనీ,
ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అన్నదాతలను ఆదుకోవాలని విజయమ్మ హితవు
పలికారు. ఆమె తుఫాను బాధితులను పరామర్శించి ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు. నష్టపరిహారం ఇప్పించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.