<strong>మైలవరం (కృష్ణా జిల్లా),</strong> 14 ఏప్రిల్ 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం 120వ రోజు ఆదివారం సంద్రాల శివారు నుంచి ప్రారంభమవుతుంది. పార్టీ కార్యక్రమాల కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఈ విషయం తెలిపారు. గణపవరం అడ్డరోడ్డు వరకు పాదయాత్ర సాగిన తరువాత శ్రీమతి షర్మిల మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారని పేర్కొన్నారు. విరామం తరువాత ఆమె వెల్వడం, మైలవరం వరకు పాదయాత్ర చేస్తారు. మైలవరంలో శ్రీమతి షర్మిల బహిరంగ సభలో ప్రసంగిస్తారని వారు తెలిపారు. మైలవరం శివారులో శ్రీమతి షర్మిల ఆదివారం రాత్రికి బస చేస్తారని చెప్పారు. ఆదివారంనాటి శ్రీమతి షర్మిల పాదయాత్ర షెడ్యూల్ మొత్తం 12.3 కిలోమీటర్లు ఉంటుందని రఘురాం, ఉదయభాను పేర్కొన్నారు.