మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
‘లీడర్ టు లీడర్’ డైరీ ఆవిష్కరించిన విజయమ్మ
16 Apr 2013 10:54 AM
హైదరాబాద్ : ‘లీడర్ టు లీడర్’ డైరీని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ తమ నివాసంలో సోమవారంనాడు ఆవిష్కరించారు. ప్రముఖ నవలా రచయిత వేంపల్లి నిరంజన్రెడ్డి ఈ డైరీని రూపొందించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జీవిత విశేషాలు, యువనేత, జననేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర, ఆయన వ్యక్తిత్వ విశేషాలతో ఈ డైరీని సచిత్రంగా రూపొందించారు.
ఈ డైరీ ఆవిష్కరణ అనంతరం నిరంజన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి అంటే తమకు ఎంతో అభిమానమని తెలిపారు. 2010 సంవత్సరంలో తొలిసారిగా ఒక డైరీని రూపొందించి వెలువరించామని, దానికి వచ్చిన స్పందనతో మరింత స్ఫూర్తిని పొంది ఈ డైరీని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. డైరీలో మహానేత జీవితంలోని ముఖ్య ఘట్టాలు, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్రెడ్డి విలక్షణ వ్యక్తిత్వాన్ని, ఓదార్పుయాత్ర విశేషాలను కళ్ళకు కట్టినట్లు డైరీలో చూపించామని నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.