అనంతపురంః వైఎస్సార్సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. టీడీపీ జనచైతన్యయాత్రలైనా, జన్మభూమి అయినా అంతా దోపిడే తప్ప అభివృద్ధి మచ్చుకు కూడా లేదని రామచంద్రారెడ్డి అన్నారు. నిజంగా మీరు లబ్ది చేసి ఉంటే ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా పోలీసులు లేకుండా ఊళ్లకు వెళ్లాలని సవాల్ విసిరారు.<br/>చంద్రబాబు తాను చేసిన కుంభకోణాల నుంచి ప్రజల మనసును మళ్లించేందుకే జన్మభూమి అంటున్నారని రామచంద్రారెడ్డి విమర్శించారు. ప్రజలు ఎక్కడ కొడతారోనని భయపడి పోలీసులతో గ్రామాల్లోకి వెళుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అబద్ధాల కోరని, తమను దగా చేశాడని సొంత గ్రామ ప్రజలే చంద్రబాబును తిట్టిపోశారని రామచంద్రారెడ్డి అన్నారు. <br/>రిషితేశ్వరి కేసులో గానీ, వనజాక్షి కేసులో గానీ , పుష్కరాల్లో 30 మందిని పొట్టనబెట్టుకున్న కేసు లోగానీ ......లేక కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసు, చంద్రన్న కానుకల్లో అవకవతకలు, కోట్ల కుంభకోణం గురించి ... చంద్రబాబుకు ఏమాత్రం సిగ్గు లజ్జ ఉన్నా నిగ్గు తేల్చాలని రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ చేస్తున్నది జన్మభూమి కాదని పోలీసు భూమి అని తూర్పారబట్టారు.