వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
దళితుల అభివృద్ధికి జగ్జీవన్ కృషి :విజయమ్మ
05 Apr 2013 10:35 AM
హైదరాబాద్, 05 ఏప్రిల్ 2013:
మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్ రాం జయంతి వేడుకలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీక్షా శిబిరంలో నిర్వహించింది. శుక్రవారం ఉదయం ఆయన చిత్రపటానికి పార్టీ ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ మాట్లాడారు. జగ్జీవన్ రామ్ దళితుల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. అణగారిన వర్గాల కోసం జగ్జీవన్ చేసిన సేవలను కొనియాడారు. బాబూ జగ్జీవన్ రాం అందరికీ చిరస్మరణీయులనీ, ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలనీ సూచించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కూడా దళితుల సంక్షేమానికి పాటుపడ్డారని ఆమె చెప్పారు.