రైతుల గొంతు కోస్తున్న చంద్రబాబు..!

హైదరాబాద్: రాజధాని పేరుతో
చంద్రబాబు రైతుల గొంతు కోస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే రామక్రిష్ణా రెడ్డి
వ్యాఖ్యానించారు. కొత్తగా నిర్మిస్తున్న రాజధాని ప్రాంతంలో ఎక్స్ ప్రెస్ హైవేల
రూట్ మార్చేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆయన అన్నారు. నాడు మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబునాయుడు
ఇప్పుడు రైతులను నమ్మించి నట్టేట ముంచారని ఆరోపించారు. చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలు
చేయకుండా రైతుల గురించి పునరాలోచించాలని
హితవు పలికారు.

Back to Top