నెల్లూరు జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీకే పట్టం

నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నామంటూ నెల్లూరు ఓటర్లు తీర్పు చెప్పారు. నెల్లూరు జిల్లాలో 46 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ 13 స్థానాలు కైవసం చేసుకుంది. 554 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు వైఎస​ఆర్‌సీపీ ఖాతాలో 226 ఎంపీటీసీ స్థానాలు చేరగా టీడీపీ కేవలం 5 స్థానాలే దక్కించుకోగలిగింది. బీజేపీ 2, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు.

Back to Top