కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఇడుపులపాయలో మహానేతకు అభిషేకం
29 Nov 2012 1:54 PM
ఇడుపులపాయ:
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ సమాధికి ఆయన అభిమానులు అభిషేకం చేశారు. వందలాదిమంది వివిధ ప్రాంతాలనుంచి పాదయాత్రగా తరలి వచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, గురునాథరెడ్డి, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి అపర భగీరథునికి నివాళులర్పించారు. జగన్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వారు చెప్పారు. ఆయనను అన్యాయంగా జైలులో ఉంచారని పేర్కొన్నారు.
మరోవంక, శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానానికి తరలి వస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇడుపులపాయనుంచి ఇచ్చాపురం దాకా వందలాది మంది నడిచి వస్తున్నారు. వారిలో వృద్ధులు సైతం ఉన్నారు. యువకుల కోలాహలం సరేసరి. మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పెద్ద వయసులో ఉండీ ఇచ్ఛాపురం వరకూ ఎలా నడుస్తారని ఓ వృద్ధుడిని ప్రశ్నించగా.. నడిస్తేనే జగన్ సీఎం అవుతాడనీ, ఆయన వస్తేనే నీళ్ళు వస్తాయనీ వివరించారు.