గుంటూరు: ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని మంగళగిరి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండు చేశారు. బుధవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు 2015లో ఓటుకు నోటు కేసు జరిగింది 2017లో సుప్రీం కోర్టులో కేసు వేశాను గత ఐదు నెలల్లో చిన్న చిన్న కారణాలతో కేసు వాయిదా కోరారు రేపు కేసు విచారణ జరగబోతుంది అన్ని సాక్షాలు ఉన్నా కేసు విచారణ ఆలస్యం కావడం తప్పుడు సంకేతాలు పంపుతుంది ఏడేళ్లయినా విచారణ జరగకపోతే ఇక సామాన్యులకు న్యాయం అందుతుందా? ఓటు కు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు తెలంగాణ ఏసిబి ఈ కేసును సరిగా విచారణ చేయడం లేదు అందుకే సీబిఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి ఇవి కాక మరో మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి మత్తయ్య, సెబాస్టియన్ కూడా దీనిపై సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు అలాగే మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరారు ఈ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది ఇన్ని కేసులున్నా, చంద్రబాబు సిగ్గు లజ్జా లేకుండా బుకయిస్తున్నారు ఏడేళ్లయినా చిన్న కారణాలతో సాగదీస్తున్నారు రెడ్ హ్యాండెడ్గా ఆడియో, వీడియోలో దొరికినా దొరలా తిరుగుతున్నారు నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణ సీఎం అయ్యారు నోట్లు పంపిన వ్యక్తి సీఎం కావాలని తిరుగుతున్నారు అన్ని సాక్ష్యాలు ఉన్నా కేసు ఆలస్యం అయితోంది ముద్దాయి ఎవరో అందరికీ తెలిసినా దర్జాగా తిరుగుతున్నారు ఇకనైనా న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగేలా సంకేతాలు ఉండాలి ఓటుకి నోటుకు సంబంధించి ఐదు కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. అయిదు కోట్లకి బేరం కుదుర్చుకుని, యాభై లక్షలు రేవంత్ ఇస్తూ పట్టుబడ్డారు కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ కేసులో ఆలస్యం చేసింది ఇప్పుడు మాత్రం కేసు బదిలీ అడుగుతున్నారు రాజకీయ స్వార్థంతో కేసు గురించి పట్టించుకోలేదు