నేడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప‌ర్య‌ట‌న షెడ్యూల్

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డి నేడు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. మంగళవారం ఉదయం ఒంగోలు పార్లమెంట్ ప‌రిధిలో కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరులో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గంలో మైదుకూరు నాలుగు రోడ్ల జంక్షన్‌లో జరిగే సభ లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్ర‌సంగిస్తారు. 

Back to Top