వైయ‌స్ఆర్ సీపీలో చేరిన‌ వెంక‌ట రామ‌చంద్రరావు దంప‌తులు

తాడేప‌ల్లి: విశాఖపట్నం టీడీపీ సీనియర్‌ నేత గంపల వెంకట రామచంద్ర రావు, ఆయన సతీమణి సంధ్యా రాణి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పుకున్నారు. రామ‌చంద్ర‌రావు విశాఖపట్నం టీడీపీ సౌత్, ఈస్ట్‌ ఎలక్షన్ ఇన్‌చార్జిగా పనిచేశారు. గతంలో ఏపీసీసీ జాయింట్‌ సెక్రటరీగా, ఏపీసీసీ ఓబీసీ వింగ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన రామచంద్ర రావు (వాడబలిజ సామాజికవర్గం), సెన్సార్‌ బోర్డు మెంబర్‌గా, పోర్ట్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, వైజాగ్‌ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ గన్నమని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Back to Top