బాబు, ప‌వ‌న్‌ల‌పై ఈసీకి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు

అమ‌రావ‌తి: చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ఎన్నికల కమీషన్ కు వైయ‌స్ఆర్‌సీపీ  ఫిర్యాదు చేసింది.  వీటికి సంబంధించి పార్టీ ఎంఎల్ఏ మల్లాది విష్ణు,లీగల్ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు మనోహర్ రెడ్డి,పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర‌ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తిలు ఎన్నికల అధికారికి ఆధారాలను అందచేశారు.

 చంద్రబాబునాయుడు,పవన్ కల్యాణ్ లు ఈనెల 24వతేదీన నెల్లిమర్లలోను,ఈనెల 25 వతేదీన రాజంపేట,రైల్వేకోడూరులలో ఎన్నికల ప్రచారం సందర్బంగాా ముఖ్యమంత్రి వైయస్ జగన్,మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై వ్యక్తిగతంగా అనుచితవ్యాఖ్యలు చేశారు.అదే విధంగా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కోర్టు పరిధిలో ఉన్నప్పటికి వ్యాఖ్యలు చేశారు.ఇవి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం  కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
 

Back to Top