సోనియా చేతిలో కీలుబొమ్మలు

కేవీపల్లె: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేతిలో సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కీలుబొమ్మలుగా మారారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పి.రఘురామిరెడ్డి గ్యారంపల్లెలో గురువారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో నారాయణస్వామి మాట్లాడుతూ చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, వారు చేస్తున్న కుట్రలను ప్రజలుగమనిస్తున్నారన్నారు. బహిరంగ సభకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. జై జగన్ నినాదాలతో గ్యారంపల్లె హోరెత్తింది.

Back to Top