వైయస్ఆర్ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన మేమంత సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. రోడ్ షో లో వీరన్న గట్టు పల్లె క్రాస్ వద్ద వైయస్.జగన్ కు గజమాలతో స్థానికులు స్వాగతం పలికారు. దారి వెంట వైయస్ జగన్పై పూలవర్షం కురిపించారు. దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా తీర్పునిచ్చారు. తిరిగి అదే ఆనవాయితీగా ఎన్నికల ప్రచారాన్నివైయస్ఆర్ ఘాట్లో ప్రార్థనల అనంతరం సీఎం వైయస్ జగన్ ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వీరన్నగట్టుపల్లె, వేంపల్లె, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా వైయస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర ప్రొద్దుటూరుకు చేరుకోనుంది. సాయంత్రం 4 గంటల నుంచి బహిరంగ సభ ప్రారంభం కానుంది. కాగా, బస్సు యాత్ర కొనసాగే దారి వెంట పండుగ వాతావరణం నెలకొంది. అభిమాన నాయకుడికి అండగా నిల్చేందుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. బస్సు యాత్రలో ఎండను సైతం లెక్క చేయకుండా జనం ముందడుగు వేస్తున్నారు.