జ‌న‌సేన నేత బ‌త్తిన రాము వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌

తాడేప‌ల్లి: జ‌న‌సేన పార్టీ విజ‌య‌వాడ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బ‌త్తిన రాము వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వైయస్‌ఆర్ సీపీ ఎంపీ అభ్య‌ర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైయ‌స్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. 

Back to Top