ఓటుకు కోట్లు కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే ఆర్కే
25 Nov, 2019 16:04 IST
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసుపై సుప్రీం కోర్టులో మరోసారి పిటీషన్ దాఖలైంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు కోట్ల కేసుపై మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎర్లీ హియరింగ్ పిటీషన్ దాఖలు చేశారు. 2017లో పిటీషన్ దాఖలు చేసినా కోర్టులో లిస్టింగ్ కాకపోవడంతో మరోసారి ఎమ్మెల్యే ఆర్కే పిటీషన్ దాఖలు చేశారు.