పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో పామాయిల్ రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. పామాయిల్ రైతులను ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. దెందులూరులో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేస్తూ దెందులూరు వచ్చిన వైయస్ జగన్మోహన్రెడ్డి రైతు సదస్సు ఏర్పాటు చేశారని, ఆ సదస్సుకు పామాయిల్ రైతులు తరలివచ్చి వారి ఇబ్బందులను వైయస్ జగన్కు వివరించారన్నారు. ఏపీలో పంటకు, తెలంగాణలో పంటకు ఓఈఆర్ డిఫరెంట్ ఉందని, రూ. వెయ్యి పైచిలుకు తక్కువగా ఇస్తున్నారని చెప్పగా.. మన ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామని మాట ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. పామాయిల్ రైతుల కష్టాలను తెలుసుకోవడానికి మంత్రులు కన్నబాబు, ఆళ్ల నాని, వనిత, ప్రభుత్వ ముఖ్యసలహాదారు అజేయ కల్లాం బృందాన్ని పంపించారన్నారు. వారంతా రైతుల కష్టాలు తెలుసుకోవడంతో పాటు పెదవేగి ఆయిల్ ఫ్యాక్టరీని పరిశీలించారన్నారు.
పెదవేగి ఆయిల్ ఫ్యాక్టరీ నిర్వహణను రైతులకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. అదే విధంగా పామాయిల్ రైతులను ఆదుకోవడానికి తెలంగాణతో సమానమైన రేటు ఇవ్వాలని రూ.87 కోట్లు మంజూరు చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
Read Also: కలానికి కాదు..తప్పుడు వార్తలు రాసే కులానికి సంకెళ్లు