సుధాకర్‌రావు మృతికి సీఎం వైయస్‌ జగన్‌ సంతాపం

29 Oct, 2019 12:27 IST

 

అమరావతి: ఆర్టీఐ మాజీ కమిషనర్‌ సుధాకర్‌రావు మృతిపట్ల సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుధాకర్‌రావు కుటుంబ సభ్యులకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉమ్మడి ఏపీలో 2005–10 వరకు ఆర్టీఐ కమిషనర్‌గా పనిచేసిన సుధాకర్‌రావు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి  సుధాకర్‌రావు అత్యంత సన్నిహితులు.

Read Also: ప్రభుత్వ నిర్ణయంతో గిరిజన విద్యార్థుల్లో ఆనందం