వైయస్ఆర్ అకాల మరణంతో కరకట్ట పనులు ఆగిపోయాయి
11 Dec, 2019 11:36 IST
అసెంబ్లీ: కరకట్ట నిర్మాణాల్లో చంద్రబాబు చాలా అన్యాయం చేశారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా. ఈ జిల్లాను అభివృద్ధి చేయాలని ఆ రోజు మహానేత వైయస్ఆర్ కరకట్ట నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఆయన అకాల మరణంతో అన్ని పనులు నత్తనడకన నడిచాయి. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయం వల్ల కరకట్టలు పూర్తి చేయలేకపోయారు. సీఎం వైయస్ జగన్ మా జిల్లా కష్టాలను గ్రహించి కరకట్టలు పూర్తి చేయాలి.