అసెంబ్లీలోకి కార్యకర్తలను కూడా వెంటేసుకుని మూకుమ్మడిగా దూసుకు వస్తున్నారు ప్రతిపక్ష సభ్యులు. ఘటోత్కచుడిలా ఒకాయన రొమ్ము విరుచుకుని వచ్చి మరీ మార్షల్స్ తో గొడవపడుతున్నాడు. ఇంతకీ వీళ్లిలా రావడం ఏదో సాధించాలనో, సభలో ప్రజా సమస్యలపై పోరాడాలనో కాదు. నిత్యం ఏదో గలాటా సృష్టించి మీడియాలో ఉబలాటం చూపించాలన్నదే వీళ్ల ఆలోచన. ఇరవై మంది కూడా ఎమ్మెల్యేలు గేటు దగ్గర లేరు. ఉన్నవాళ్లు కూడా పెదబాబు, చినబాబుల కోసం ఎదురు చూసి మీడియా మైకులు, కెమెరాలు వచ్చిన తర్వాత డ్రామాలు మొదలుపెడుతున్నారు.
Read Also: తప్పు చేసి అవాస్తవాలు మాట్లాడుతున్నారు