కరకట్ట పనులు త్వరగా పూర్తి చేయాలి
11 Dec, 2019 11:29 IST
అసెంబ్లీ: వంశధార కరకట్టలు, నాగావలి కరకట్టలు చాలా కాలంగా నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వం అలసత్వమే కారణం. గతంలో భూ సేకరణ కూడా జరగలేదు. చాలా భూములు కోతకు గురవుతున్నాయి. ప్రతి ఏటా రైతులు నష్టపోతున్నారు. 2007 నుంచి కరకట్ట పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కాంట్రాక్ట్ మార్చి రీ టెండరింగ్ చేపట్టాలి. గ్రామాలు కూడా మునిగిపోతున్నాయి. కరకట్టలు త్వరగా పూర్తి చేయాలి. గత ప్రభుత్వం నీరు-చెట్టుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలి.
Read Also: మా కేబినెట్లో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే