రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మన పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించి వారిని ప్రపంచానికి పరిచయం చేయాలని ఆశ పడుతున్నారు. కార్పొరేట్ స్కూళ్లతో మన సర్కారు బడులు పోటీ పడాలని ముఖ్యమంత్రి కోరిక. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్క్లీకి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ గ్రోత్ మరియు సెంటర్ ఫర్ కార్పోరేట్ ఇన్నొవేషన్ సాల్మన్ డార్విన్ 15.06.2019 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఒక ఒక లేఖ రాశారు. మీ తండ్రి వైఎస్సార్ తీసుకొచ్చిన పథకాలను, అడ్మినిస్ట్రేషన్ను కొనసాగిస్తున్నారని మా దృష్టికొచ్చింది. చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వానికి పలు విన్నపాలు చేసిన మమ్మల్ని వాడుకోలేకపోయింది. మీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని మేం ఉత్సాహంగా ఉన్నాం. అవకాశం దొరికితే జూలైలో మమ్మల్ని కలుస్తారని ఆశిస్తున్నామని లేఖలో రాశారు. మీలా డబ్బాలు కొట్టుకోవడం ఇష్టం లేకనే ఇన్నాళ్లు చెప్పలేదు. ఇప్పుడు సందర్భం దొరికింది కాబట్టి చెబుతున్నాం.
- మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
Read Also: థ్యాంక్యూ జగనన్న