పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి

3 Dec, 2019 15:09 IST

గుంటూరు: పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని హోం మంత్రి మేకతోటి సుచరిత సూచించారు.పరిధి చూడకుండా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించకూడదని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానంతో వ్యవహరించాలని తెలిపారు. పోలీస్‌ స్టేషన్ల వద్ద ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మహిళా పీఎస్‌లలో మహిళా అధికారులను నియమిస్తామని వెల్లడించారు. 

Read Also: చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాల్‌