ఢిల్లీ బయల్దేరిన సీఎం వైయస్ జగన్
5 Dec, 2019 18:08 IST
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రేపు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని, అదే విధంగా రాష్ట్ర ఆర్థిక లోటు భర్తీ చేయాలని ప్రధాని మోడీని సీఎం వైయస్ జగన్ కోరనున్నారు.