తాడేపల్లి: పత్రికల్లో వచ్చిన కథనాల చదివి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. చిన్నారి శశిధర్ వైద్య ఖర్చులకు కావాల్సిన డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. విజయవాడ కస్తూరిభాయిపేటకు చెందిన నాలుగేళ్ల చిన్నారి శశిధర డెంగీ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. జ్వరం తీవ్రమై మెదడుకు చేరిందని, వెంటనే బ్రెయిన్ సర్జరీ చేయాలని, రూ. 3 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. తమ కుమారుడికి వైద్యం చేయించేందుకు అంత డబ్బు లేదని ఆ తల్లిదండ్రుల బాధపై పలు పత్రికల్లో కథనాలు రావడంతో వాటిని చదివిన ముఖ్యమంత్రి వెంటనే శశిధర్ వైద్య ఖర్చులకు కావాల్సిన డబ్బులను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించాలని అధికారులకు సూచించారు. శశిధర్కు సంబంధించిన రిపోర్టు తీసుకురావాలని సీఎం కార్యాలయం నుంచి శశిధర్ తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. తమ చిన్నారి పరిస్థితి తెలుసుకొని ముఖ్యమంత్రి నేరుగా స్పందించడంపై తల్లిదండ్రులు, శశిధర్ చదివే స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: ఆంగ్ల మాధ్యమంపై అపోహలు వీడండి