ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు అందజేత

11 Nov, 2019 12:47 IST

విజయవాడ: మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్య, మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని విజయవాడలోని ఏప్లస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతూ ప్రతిభకనబర్చిన విద్యార్థులకు రూ. 20 వేల నగదు, ట్యాబ్స్, మెడల్స్‌ను సీఎం వైయస్‌ జగన్‌ అందజేశారు. 

Read Also: చదువు అనే గొప్ప ఆస్తిని ఇస్తా