రాష్ట్రం అన్నిరంగాల్లో పురోభివృద్ధి సాధించాలి
1 Nov, 2019 11:04 IST
అమరావతి: రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాక్షించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందాలని చెప్పారు.