తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కొత్త ఒరవడి సృష్టిస్తూ.. పేదల తరఫున పెత్తందారులతో సమరానికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో.. ఎక్కడికి వెళ్లినా సంక్షేమ సారథికి జనం నీరాజనం పడుతున్నారు. సిద్ధం, మేమంతా సిద్ధం, జగన్ కోసం సిద్ధం.. ఏ కార్యక్రమం చేపట్టినా స్వచ్ఛందంగా ప్రజలు అందులో భాగం అవుతున్నారు. వైయస్ జగన్ వన్స్మోర్.. వైయస్ జగనే మళ్లీ మా సీఎం అంటూ నినాదాలతో మారుమోగిపోయేలా చేస్తున్నారు. అంతేకాదు ఎక్కడికి వెళ్లినా సిద్ధం నినాదాన్ని వినిపిస్తున్నారు కూడా. తాజాగా నా అక్కచెల్లెమ్మలందరూ సిద్ధం! అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.