నాలుగో రోజు `మేమంతా సిద్ధం` బ‌స్సుయాత్ర ప్రారంభం

క‌ర్నూలు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేప‌ట్టిన `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర నాలుగో రోజు అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. పత్తికొండలోని రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి ప్రారంభ‌మైన బ‌స్సు యాత్ర రాత‌న మీదుగా మ‌రికాసేప‌ట్లో తుగ్గలి చేరుకోనుంది. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌లో పాల్గొనేందుకు ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. జ‌న‌నేత‌కు జై కొడుతూ, పూల వ‌ర్షం కురిపిస్తూ త‌మ అభిమానాన్ని చాటుతున్నారు. యాత్ర‌కు త‌ర‌లివ‌చ్చిన అభిమానులు, ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముందుకుసాగుతున్నారు. తుగ్గ‌లి గ్రామస్తులతో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ముఖముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జొన్నగిరి,  గుత్తి మీదుగా  ప్రయాణించి గుత్తి శివారులో భోజనవిరామం తీసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు బయలుదేరి పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్ , ఆకుతోటపల్లి , సంజీవపురం శివారు వరకు బస్ యాత్ర కొనసాగుతుంది. సంజీవపురం శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

Back to Top