తిరుమల: టీటీడీ చైర్మన్గా వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన టీటీడీ ఛైర్మన్గా మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకం జరగనుంది. వైవీ సుబ్బారెడ్డి నియామకం పట్ల వైయస్ఆర్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.