మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన పవన్కు తెలియదా?
శ్రీసత్యసాయి జిల్లా: కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన పవన్కు తెలియదా? అని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల నిలదీశారు. రాష్ట్రంలో రోజుకో దారుణం జరుగుతున్నా పవన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆమె ప్రశ్నించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్కు కనిపించడం లేదా అని నిలదీశారు. మహిళలపై అఘాయిత్యాలను పవన్ ఎంందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. టీడీపీ కూటమిది ప్రజా విజయం కాదు.. ఈవీఎంల గెలుపని విమర్శించారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖమంత్రిగా ఉంటేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని, పేదల సన్నిధి వైయస్ జగన్ అని శ్యామల కొనియాడారు.