వైయస్ఆర్సీపీ పార్టీ జిల్లా, నగర అధ్యక్షుల నియామకం
3 Sep, 2024 20:02 IST
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మూడు జిల్లాల అధ్యక్షులు, రాజమండ్రి నగర పార్టీ అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
- అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
- సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్
- తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
- రాజమండ్రి నగర పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ మార్గాని భరత్