2025లో ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలి
31 Dec, 2024 19:03 IST
తాడేపల్లి: నూతన సంవత్సరం 2025లో ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. 2025లో ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సంవత్సరం ప్రతి ఇంట్లో ఆనందం నింపాలని, ఆరోగ్యం అందించాలని.. ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని వైయస్ జగన్ అభిలషించారు.