నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్
25 Apr, 2024 12:23 IST
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల వైయస్ఆర్ సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల సీఎస్ఐ గ్రౌండ్లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం నేరుగా మినీ సెక్రటేరియట్లోని ఆర్వో ఆఫీస్కు వెళ్లారు. పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి పాల్గొన్నారు.