హరికృష్ణ యాదవ్ కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండ
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ యాదవ్ ఇటీవల కరోనాతో కన్నుమూశారు. ఆయన కుటుంబానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. నిన్న పార్టీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంట సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చనున్నారు. హరికృష్ణ యాదవ్ గత పది సంవత్సరాలుగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ జగనన్న సైనికుడిగా పని చేశారు. అలాంటి కార్యకర్త కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండగా నిలిచింది.
జూమ్ మీటింగ్లో సోషల్ మీడియా సోల్జర్స్ కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. వివరాలకు కింది లింక్ను క్లిక్ చేసి మీటింగ్లో జాయిన్ కావచ్చు.
Topic: YSRCP Party offering Condolences to our Late Hari Krishna Yadav ( State IT Wing Secretary, YSRCP)
Time: Apr 29, 2021 - 1:00 PM India
Join Zoom Meeting
https://zoom.us/j/96595964747
Meeting ID: 965 9596 4747