నా ధైర్యం వైయస్ జగనే
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డినే తన ధైర్యమని, ఊపిరి ఉన్నంత వరకు ఆయన వెంటే ఉంటానని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. నా ఇంటి గేటుకు, వైయస్ఆర్ విగ్రహాలకు టీడీపీ జెండా కట్టే ధైర్యం రాష్ట్రంలో ఎవరికీ లేదని ఆయన సవాల్ చేశారు. తన ఇంటికి టీడీపీ జెండా కడుతామన్న టీడీపీ నేత ప్రవీణ్కుమార్కు రాచమల్లు కౌంటర్ ఇచ్చారు. `నా ధైర్యం, నా నమ్మకం వైయస్ జగన్, నా ఊపిరి ఉన్నంత వరకు వైయస్ఆర్సీపీలోనే ఉంటా. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి. ఎన్నికల ముందు నారా లోకేష్ ప్రొద్దుటూరు టిడిపి టికెట్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కి ప్రకటించి మాట తప్పారు. వైయస్ఆర్సీపీలో సామాన్యులకు పేదవారికి పదవులు దక్కాయి. పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్, మునిసిపల్ చైర్పర్సన్గా బిమునిపల్లి లక్ష్మీదేవి, ఆర్యవైశ్య లకు ఇద్దరికి టిటిడి బోర్డు మెంబర్ పదవులు ఇచ్చాం. మా ప్రభుత్వంలో ప్రొద్దుటూరు కు రూ. 150 కోట్లతో మంచినీరు ఇచ్చాం. పట్టణంలో మునిసిపల్ పార్క్, మైదుకూరు రోడ్డు విస్తరణ, తాత్కాలిక కూరగాయల మార్కెట్, నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేశాం. ప్రొద్దుటూరు పట్టణంలో జరుగుతున్న పనులు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేయాలి. టీడీపీ మహానాడుకు నియోజకవర్గం నుంచి 4 వేల మందికి మించి పోలేదు. అది కూడా ఉపాధి హామీ కూలిలకు మస్టర్ వేయించి తీసుకెళ్తున్నారు. 2029 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది` అంటూ రాచమల్లు శివప్రసాద్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.