న్యూఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైయస్ఆర్ సీపీ ఎంపీలు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో పాటు తొమ్మిది ఇతర డిమాండ్లను నెరవేర్చవలసిందిగా కోరుతూ వైఎస్సార్సీపీ బృందం కేంద్రమంత్రికి వినతి పత్రం అందజేశారు.