రాష్ట్రానికి మంచిరొజులొచ్చాయి
29 Jun, 2019 17:26 IST
వైయస్ఆర్ జిల్లా: గత ఏడేళ్లుగా వైయస్ఆర్ జిల్లాను పాలకులు పూర్తిగా విస్మరించారని వైయస్ఆర్సీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అన్నారు.జిల్లా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా రావడంతో వైయస్ఆర్ జిల్లాతో పాటు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను ముఖ్యమంత్రి నెరవేరుస్తారని తెలిపారు.పరిశ్రమలతో పాటు యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.తాగునీటి సమస్యకు పూర్తిగా పరిష్కారం లభిస్తుందన్నారు.