విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతిపై తన వైఖరిని మార్చుకున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. "చంద్రబాబు "అజ్ఞాత పార్ట్నర్'' కూడా యూటర్నుల మాస్టర్ అయిపోయారు. నాడు అమరావతి ప్రజా రాజధాని కాదు, టీడీపీ రాజధాని అని గర్జించిన వ్యక్తి ఇప్పుడు రాజధానిని అక్కడి నుంచి మారిస్తే ఒప్పుకునేది లేదంటున్నారు. మాటపై నిలబడలేని వారు రాజకీయాలను ఏం మారుస్తారు?" అని ఆయన వ్యాఖ్యానించారు.