న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మర్యాపూర్వకంగా కలిశారు. పార్లమెంట్లోని పీఎం కార్యాలయంలో ప్రధాని మోడీని కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు.