ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పు బాబూ
8 Sep, 2020 12:57 IST
తాడేపల్లి: ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తీరుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విట్టర్లో ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ... ‘అంతర్వేది ఆలయ రథం దగ్ధంపై గంటల వ్యవధిలోనే నిజనిర్ధారణ కమిటీ వేశారు చంద్రబాబు గారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పేతే కనీసం నోరు కూడా మెదపలేదెందుకని ప్రజలు అడుగుతున్నారు. రమేశ్ హాస్పిటల్స్పై ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పి కాపాడాడు’ అంటూ ట్వీట్ చేశారు.