అమరావతి: తండ్రిలా కిడారి కుటుంబాన్ని ఆదుకుంటానన్న చంద్రబాబు.. లోకేశ్ ఎమ్మెల్సీ సీటును ఏపీ గిరిజన, వైద్య శాఖ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు ఎందుకు ఇవ్వలేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. నక్క జిత్తుల రాజకీయాలకు మరో వందేళ్ల పేటెంటు మీదే చంద్రబాబూ. అరకు ఎమ్మెల్యే కిడారిని నక్సల్ హతమారిస్తే, కొడుకు శ్రావణ్ ను మంత్రిని చేశావు. 6 నెలల గడువు ముగిసింది. తండ్రిలా ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అన్నోడివి లోకేశ్ ఎమ్మెల్సీ సీటును శ్రావణ్ కు ఎందుకివ్వలేక పోయావ్?’ అని విమర్శలు గుప్పించారు. కిడారి శ్రావణ్ పదవీకాలం రేపటితో పూర్తికానుంది. దీంతో ఈరోజు రాజీనామా చేసేందుకు ఆయన అమరావతిలోని సచివాలయానికి చేరుకున్నారు.