ఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద నర్సాపురం నుంచి గెలిచి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు వైయస్ఆర్ సీపీ ఎంపీ, లోక్సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను తాము లోక్సభలో స్పీకర్ కు సమర్పించామని, అనేక పర్యాయాలు డిస్ క్వాలిఫికేషన్కు సంబంధించి స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేశామని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా లోక్సభ స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేశామని ఎంపీ భరత్ తెలిపారు.