విజయవాడ: అమరరాజా ఫ్యాక్టరీది రాజకీయ సమస్య కాదు.. పొల్యూషన్ సమస్య అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అమరరాజాతో పాటు 54 ఫ్యాక్టరీలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు ఇచ్చారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. గతంలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై చంద్రబాబు గగ్గోలు పెట్టారని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్న అమరరాజా ఫ్యాక్టరీపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అమరరాజా ఫ్యాక్టరీపై తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు.