టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి
5 Mar, 2019 12:21 IST
వైయస్ఆర్ జిల్లా: డేటా చోరీ చేసిన చంద్రబాబు, లోకేష్లను శిక్షించాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి డిమాండు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలు తమ ఆధార్ను మార్చుకోవాలని సూచించారు.