నెల్లూరు: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తొలిసారిగా అన్ని అసెంబ్లీ,పార్లమెంటు స్థానాలు గెలిచి రికార్డు సృష్టించిన పార్టీ వైయస్ఆర్సీపీ అని ఆ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.సోమవారం నెల్లూరు వైయస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజలు ఎన్నో ఆశలతో వైయస్ఆర్సీపీకి ఓట్లు వేసి గెలిపించారని...వారి ఆశలు నెరవేర్చే విధంగా పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పనితీరు ఆధారంగానే 2024లో ఓట్లు అడుగుతామని ఆయన తెలిపారు..టీడీపీ ప్రభుత్వం వల్లే పక్షపాత ధోరణితో కాకుండా, అవినీతి,అక్రమాలకు తావులేకుండా పాలన అందిస్తామని తెలిపారు. పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు.