తాడేపల్లి: ప్రభుత్వ విప్గా ఇటీవల నియమితులైన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్గా అవకాశం కల్పించినందుకు సీఎం వైయస్ జగన్కు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. చిర్ల జగ్గిరెడ్డిని ప్రభుత్వ విప్గా నియమిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.