మాటల్లో కాదు..చేతల్లో చూపుతున్నారు..

7 Jun, 2019 12:53 IST

 

తాడేపల్లి: నా రాజకీయ జీవితంలో వైయస్‌ జగన్‌ లాంటి సీఎంను చూడలేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.మాటలు చెప్పటం కాదని చేతల్లో చూపుతున్నారన్నారు.పదవుల్లో సామాజిక న్యాయం చేసిన ఘనత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిదన్నారు.జగన్‌ నాయకత్వంలో రాష్ట్రం స్వర్ణయుగంగా మారబోతుందన్నారు.సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.ప్రజలకిచ్చిన హామీలను వైయస్‌ జగన్‌ నిలబెట్టుకుంటారని అందులో సందేహాం లేదన్నారు.ప్రజాధనం దుర్వినియోగం కాకుండా  పారదర్శక పాలన సాగిస్తున్నారన్నారు.